16 మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2021-10-27T18:07:21+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 16 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,380 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 720 పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి

16 మందికి Covid పాజిటివ్

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 16 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,380 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 720 పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మంగళవారం ఇద్దరు చేరగా.. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 17మంది చికిత్స పొందుతుండగా.. 303బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-10-27T18:07:21+05:30 IST