జగన్కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ
ABN , First Publish Date - 2020-05-23T17:34:33+05:30 IST
అమరావతి: సీఎం జగన్కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు లేఖ రాశారు. సీఎంకు లేఖ రాసిన వారిలో..
అమరావతి: సీఎం జగన్కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు లేఖ రాశారు. సీఎంకు లేఖ రాసిన వారిలో మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేష్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి తదితరులున్నారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించాలని కోరారు. అక్కడ మిగిలిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలని రాయలసీమ నేతలు లేఖలో పేర్కొన్నారు.