16 జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2022-03-15T16:49:59+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింతగా తగ్గింది. సోమవారం 106 మందికి వైరస్ నిర్ధారణ కాగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 61 మంది, మైసూరులో 11 మంది, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు,
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింతగా తగ్గింది. సోమవారం 106 మందికి వైరస్ నిర్ధారణ కాగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 61 మంది, మైసూరులో 11 మంది, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఇతర జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 337 మంది కోలుకోగా నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2, 420 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1,954 మంది ఉన్నారు.