అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,69,770 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 14,412 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి 20,52,230 మంది రికవరీ చెందారు.