ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 1513 కేసులు, 9 కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-06-04T03:19:09+05:30 IST

దేశ రాజధానిలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో...

ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 1513 కేసులు, 9 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1513 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,645కు చేరింది. ఢిల్లీలో మంగళవారం 299 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 606 మంది కరోనా సోకి చికిత్స పొందుతూ చనిపోయారు. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,497.

Updated Date - 2020-06-04T03:19:09+05:30 IST