ఏపీలో కొత్తగా 1,502 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-05T00:11:34+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య అధికారులు బులెటిన్ విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,19,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 19,903 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి రికవరీ చెందారు.