కొవిడ్కు 150 మంది టీచర్లు బలి
ABN , First Publish Date - 2021-05-06T09:18:53+05:30 IST
కొవిడ్ సెకండ్వేవ్లో వంద మందికిపైగా టీచర్లు మరణించారని, వేలాది మంది బాధితులయ్యారని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆందోళన వ్యక్తం చేసింది
మృతుల కుటుంబాలకు 50 లక్షలు ఇవ్వాలి: ఫ్యాప్టో
శ్రీకాళహస్తి, మే 5: కొవిడ్ సెకండ్వేవ్లో వంద మందికిపైగా టీచర్లు మరణించారని, వేలాది మంది బాధితులయ్యారని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొవిడ్ బారినపడి మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శికి సమాఖ్య నేతలు బుధవారం లేఖ రాశారు. గత నెల 28నాటికి కొవిడ్తో మరణించిన టీచర్ల జాబితాను లేఖతో జత చేశారు. బాధితుల్లో అనేక మందికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని పేర్కొన్నారు. కొవిడ్తో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుం బాలకు రూ.50 లక్షల వంతున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఏపీలో జిల్లాల వారీగా కొవిడ్తో మృతిచెందిన ఉపాధ్యాయుల వివరాలను పాఠశా ల విద్య ముఖ్య కార్యదర్శికి, విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్కు పంపారు.