సౌదీ రాజకుటుంబంలో 150మందికి కరోనా!
ABN , First Publish Date - 2020-04-10T07:29:20+05:30 IST
సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుటుంబానికి చెందిన 150 మందికి కరోనా సోకింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్(ఎన్వైటీ)..
రియాద్, ఏప్రిల్ 9: సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుటుంబానికి చెందిన 150 మందికి కరోనా సోకింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్(ఎన్వైటీ) పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. రియాద్ గవర్నరైన రాకుమారుడొకరు ఇప్పటికే ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రత్యేకమైన కింగ్ ఫైజల్ ఆస్పత్రి వైద్యులు రాజకుటుంబీకులకు అంతర్గతంగా జాగ్రత్తలు సూచించారని వెల్లడించింది. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న కేసుల్ని వైద్యులు త్వరగా పంపించేస్తున్నారని.. ‘అత్యవసర’ కేసుల కోసం దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్నారని తెలిపింది. ఇక, సౌదీ రాజు సల్మాన్(84) జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలోని రాజప్రాసాదంలో ఇప్పటికే స్వీయ నిర్బంధం విధించుకోగా.. రాజకుమారుడు సల్మాన్, తన కుమారుడు, ఇతర మంత్రులతో కలిసి అదే దీవిలోని మరోచోట ఉన్నట్లు ఎన్వైటీ స్పష్టం చేసింది.