బీజేపీకి 15మంది రాజీనామా
ABN , First Publish Date - 2021-06-13T08:53:52+05:30 IST
బీజేపీకి 15మంది నేతలు రాజీనామా చేశారు..
తిరువనంతపురం, జూన్ 12: లక్షద్వీప్లో బీజేపీకి 15మంది నేతలు రాజీనామా చేశారు. దర్శకురాలు అయేషా సుల్తానాపై దేశద్రోహం కేసును వ్యతిరేకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని పేర్కొంటూ స్థానిక బీజేపీ అధ్యక్షుడు సి అబ్దుల్ ఖాదిర్ హాజీకి వారంతా కలిసి లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో లక్షద్వీప్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ హమీద్ కూడా ఉన్నారు. లక్షదీవుల పైకి కేంద్రం ప్రయోగించిన జీవాయుధం ప్రఫుల్ పటేల్ అంటూ సుల్తానా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల ఆధారంగానే ఆమెపై దేశద్రోహం, ద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదయ్యాయి.