క్వారంటైన్ నుంచి పరారీ.. మళ్లీ దొరికిన 15 మంది
ABN , First Publish Date - 2020-04-03T09:24:48+05:30 IST
మహారాష్ట్రలో పుణెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 15 మంది హోం క్వారంటైన్ నుంచి తప్పించుకొన్నారు. ఎట్టకేలకు పోలీసులు వారిని గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్కు...
ముంబై, ఏప్రిల్ 2: మహారాష్ట్రలో పుణెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 15 మంది హోం క్వారంటైన్ నుంచి తప్పించుకొన్నారు. ఎట్టకేలకు పోలీసులు వారిని గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. తమ బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి వారందరూ గత నెల 22న ఉస్మానాబాద్ జిల్లాకు వెళ్లారు. అనంతరం దేశమంతా లాక్డౌన్ ప్రకటించడంతో ఉస్మానాబాద్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని చెబుతూ అధికారులు వారి చేతులపై క్వారంటైన్ ముద్ర వేశారు. కొద్ది రోజులు ఉస్మానాబాద్లో గడిపిన అనంతరం పుణెకు వెళ్లేందుకు వారు అనుమతి కోరగా అధికారులు తిరస్కరించారు. మంగళవారం రాత్రి ఓ మినీ బస్సును అద్దెకు మాట్లాడుకొని, ఉస్మానాబాద్ నుంచి తప్పించుకొన్నారు. ముంబై-పుణె హైవేలో వాడ్గావ్ దగ్గర పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారని, వారిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించామని అధికారులు తెలిపారు.