15 వేలు దాటేశ
ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 364 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 15004కు చేరుకుంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 161కు చేరుకుంది. ఫాతిమా
నేడు 364 పాజిటివ్ కేసులు నమోదు
ఏడుగురి మృతి
కడప, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 364 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 15004కు చేరుకుంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 161కు చేరుకుంది. ఫాతిమా, రిమ్స్ కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందిన 497 మందిని డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మొత్తం 8578 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.