జగ్గయ్యపేట పట్టణంలో 144 సెక్షన్ అమలు
ABN , First Publish Date - 2020-04-03T13:08:01+05:30 IST
విజయవాడ: జగ్గయ్యపేట పట్టణంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ను అమలు చేశారు.
విజయవాడ: జగ్గయ్యపేట పట్టణంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ను అమలు చేశారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, రైతు బజార్ను అధికారులు మూసివేయించారు. జగ్గయ్యపేట పట్టణాన్ని దిగ్బంధించిన పోలీసులు పట్టణంలోకి రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. పట్టణ సరిహద్దుల్లో పోలీసుల నిఘాను పెంచారు.