14 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

ABN , First Publish Date - 2022-05-07T13:26:56+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల

14 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

                         - జూన్‌ 23న ప్లస్‌ టూ పరీక్షా ఫలితాలు


పెరంబూర్‌(చెన్నై): ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... వేసవి సెలవులు ముగిసి జూన్‌ 13 నుంచి పాఠశాలలు ప్రారంభవుతాయని తెలిపింది. రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ప్లస్‌ టూ పరీక్షా ఫలితాలు జూన్‌ 23న విడుదల చేస్తామని, అదే సమయంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన టెన్త్‌ పరీక్షా ఫలితాలు జూన్‌ 17వ తేదీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్లస్‌ వన్‌ పరీక్షా ఫలితాలు జూలై 7వ తేదీ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది.

Read more