జిల్లాల విభజనపై 14 అభ్యంతరాలు
ABN , First Publish Date - 2022-01-29T06:24:06+05:30 IST
జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ గురువారమే కలెక్టర్ను కలిపి నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు.
పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని 12 మంది వినతి
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ గురువారమే కలెక్టర్ను కలిపి నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు. కాగా శుక్రవారం ఆన్లైన్లో పదమూడు అభ్యంతరాలు అందాయి. వీటిలో పన్నెండు...పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని వచ్చాయి. పెందుర్తి సెగ్మెంట్ విశాఖలోనే వుంటేనే ప్రజలకు సౌలభ్యంగా వుంటుందని కోరారు. కాగా మరొకరు నర్సీపట్నాన్న్ని జిల్లా కేంద్రం చేయాలని కోరారు.