14 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-11-25T16:27:15+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం రాజధానిలోనే కొనసాగుతోంది. ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం 254 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 14 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. అత్యధికంగా బెంగళూరులో 152

14 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం రాజధానిలోనే కొనసాగుతోంది. ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం 254 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 14 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. అత్యధికంగా బెంగళూరులో 152 మందికి వైరస్‌ ప్రబలగా మైసూరులో 30, హాసన్‌లో 15, దక్షిణకన్నడలో 14 మందికి సోకింది. కాగా రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌ కావడం ఊరటనిచ్చే అంశం. 546 మంది కోలుకున్నారు. బెంగళూరు, ధార్వాడ, కలబుర్గిలలో తలా ఒకరు కొవిడ్‌బారిన పడి మృతిచెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 6,412మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-11-25T16:27:15+05:30 IST