13వ అగ్రిటెక్ ఇండియా 2022 అతిపెద్ద అగ్రి ఎక్స్ పో...
ABN , First Publish Date - 2022-08-13T03:12:53+05:30 IST
మీడియా టుడే గ్రూపు ఆద్వర్యంలో బెంగళూరులో మూడు రోజులపాటు 13వ ఇండియా ఫుడెక్స్ 2022 ప్రదర్శనను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: మీడియా టుడే గ్రూపు ఆద్వర్యంలో బెంగళూరులో మూడు రోజులపాటు 13వ ఇండియా ఫుడెక్స్ 2022 ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఆగస్టు 26, 27, 28 తేదీల్లో ఈ ప్రదర్శన బీఐఈసీలో నిర్వహించబడుతుంది హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మీడియా టుడే గ్రూప్ నిర్వహించే ఈ వార్షిక ట్రేడ్ ఈవెంట్ ప్రదర్శన సంబంధిత రంగాల అవసరాలను తీర్చడంతోపాటు, 12వ గ్రెయిన్టెక్ ఇండియా 2022 మరియు 11వ డైరీటెక్ ఇండియా 2022 అవసరాలను తీర్చే ఏక ప్రదర్శనగా నిలువనుంది. వ్యవసాయ రంగంలో కొత్త విదానాలు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకొని దేశాన్ని ఆహారఘనిగా మార్చేందుకు అవసరమైన పలు అంశాలపై చర్చించేందుకు, అవగాహన కల్పించేందుకు, కలిసి ముందుకు సాగేందుకు ఈ ప్రదర్శన వేదికగా నిలువనుంది. తద్వారా మేకిన్ ఇన్ ఇండియా నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
చీఫ్ కోఆర్డినేటర్ S. జాఫర్ నఖ్వీ మాట్లాడుతూ.. ఆహార రంగంలో వాణిజ్య పెరుగుదలతోపాటు ఒక సరైన విదానంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆహార ఉత్పత్తులు, ఫుడ్ రిటైలింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్ మరియు వేర్హౌసింగ్ టెక్నాలజీల యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందించింది మరియు ఎగ్జిబిటర్లకు చక్కని వేదికను అందిస్తుంది. భారతీయ పెంపకందారులు, అగ్రి వ్యవస్థాపకులు, స్టార్టప్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు మరియు వ్యవసాయంలోని అన్ని ఇతర వాటాదారులకు వారి వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి మరియు వైవిధ్యపరచడానికి సరైన వేదికను అందిస్తోంది. వ్యాపార సంస్థలకు తమ తాజా ఉత్పత్తి శ్రేణి, యాంత్రీకరణ & సాంకేతిక ఆవిష్కరణలను రైతుల కోసం ప్రదర్శించడానికి మరియు ప్రారంభించేందుకు ఇది ఒక ఆదర్శ వేదిక అవుతుందన్నారు. ఇక్కడ 300 కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శిస్తారు. భారతదేశం అంతటా 20000 మంది వాణిజ్య సందర్శకులు ఇక్కడికి సందర్శిస్తారు. వీరతోపాటు పొరుగు దేశాలకు చెందిన వారు పాల్గొంటారన్నారు.