ప్రకాశంలో మరో 139 మందికి పాజిటివ్‌గా నిర్దారణ

ABN , First Publish Date - 2020-07-13T13:08:41+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లా

ప్రకాశంలో మరో 139 మందికి పాజిటివ్‌గా నిర్దారణ

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 139 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నమోదయిన కేసులతో కలిపితే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1661కు చేరుకుంది. ఆదివారం నాడు మార్కాపురంలో 34, ఒంగోలులో 21 మందితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు.


లెక్కలు ఇవీ...

కరోనా నిర్ధారణ కోసం పంపిన శ్యాంపిళ్లు : 99,902

నెగిటివ్ ఫలితాలు వచ్చినవి : 94,793

ఇంకా రిపోర్టులు రావాల్సినవి : 3710

జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్నవారు : 861

ఆదివారం ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 70 మంది డిశ్చార్జ్

ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు : 939

జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు : 722గా ఉన్నాయని జిల్లా వైద్యాధికారులు మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-07-13T13:08:41+05:30 IST