జమ్మూ కశ్మీర్‌లో మరో 139 మందికి కరోనా.. 26 మంది గర్భిణీలకూ..

ABN , First Publish Date - 2020-06-04T04:33:54+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో ఇవాళ మరో 139 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్-19..

జమ్మూ కశ్మీర్‌లో మరో 139 మందికి కరోనా..  26 మంది గర్భిణీలకూ..

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఇవాళ మరో 139 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2,857కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా కరోనా బారిన పడిన వారిలో 26 మంది గర్భిణీలు, ఓ వైద్యుడు కూడా ఉన్నట్టు తెలిపారు. ‘‘ఇవాళ 139 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీళ్లలో 30 మంది జమ్మూ వాసులు కాగా.. 109 మంది కశ్మీర్‌కి చెందిన వారు..’’ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 1816 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 1007 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-06-04T04:33:54+05:30 IST