రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-04T09:00:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 36,970 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 135 మందికి పాజిటివ్‌గా

రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు

అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 36,970 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 135 మందికి పాజిటివ్‌గా వచ్చినట్టు వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,215కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో వైరస్‌ ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ జిల్లాలో తాజాగా 31 మంది కరోనా బారినపడగా.. విశాఖపట్నంలో 23, కృష్ణాలో 15, శ్రీకాకుళంలో 12, అనంతపురంలో 11, కర్నూలులో 10 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 82 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 8,82,219కి చేరుకుంది. ప్రస్తుతం 826 యాక్టివ్‌ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 7,170కి పెరిగాయి.

Updated Date - 2021-03-04T09:00:27+05:30 IST