Money Laundering Case: Odisha మాజీ MLA ₹133 కోట్ల ఆస్తులు seize
ABN , First Publish Date - 2022-05-12T20:35:24+05:30 IST
జితు పట్నాయక్గా ఆయన ఒడిశాలో చాలా మందికి సుపరిచితం. చంపౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభర్థిగా ఎన్నికయ్యారు. కాగా, రైడ్ల గురించి ఈడీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేసి..
భుబనేశ్వర్: అక్రమ మైనింగ్తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న Odisha కు చెందిన మాజీ MLA Jitendra Nath Patnaik కు చెందిన 133 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసినట్లు Enforcement Directorate గురువారం తెలిపింది. దీంతో పాటు మరో 70 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేసినట్లు ఇదే ప్రకటనలో పేర్కొన్నారు. కోయింజర్ జిల్లాలోని జోడాలో ఉన్న పట్నాయక్కు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో ఆస్తుల్ని గుర్తించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
జితు పట్నాయక్గా ఆయన ఒడిశాలో చాలా మందికి సుపరిచితం. చంపౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభర్థిగా ఎన్నికయ్యారు. కాగా, రైడ్ల గురించి ఈడీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పొందారు. మేం నిర్వహించిన రైడ్లో 133 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించాం. మరో 70 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు. ఒడిశా విజిలెన్స్ సెల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా మైనింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.