ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-28T22:51:44+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రం మొత్తం 20,10,566కు పాజిటివ్ కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 13,807 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,853 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81,906 మంది రికవరీ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.