13ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం.. విషయం తెలిసి తొలుత షాకైన తల్లిదండ్రులు.. కానీ ఆ తర్వాత వాళ్లే దగ్గరుండి మరీ..

ABN , First Publish Date - 2022-02-11T00:51:42+05:30 IST

13ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం తీసుకుంది. తర్వాత తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పింది. అది వినగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత కూతురి మనసుని అర్థం చేసుకు

13ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం.. విషయం తెలిసి తొలుత షాకైన తల్లిదండ్రులు.. కానీ ఆ తర్వాత వాళ్లే దగ్గరుండి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: 13ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం తీసుకుంది. తర్వాత తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పింది. అది వినగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత కూతురి మనసుని అర్థం చేసుకున్నారు. ఆమె అభిప్రానయాన్ని గౌరవించారు. అంతేకాకుండా కన్నబిడ్డ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లా, లాంబోడి ప్రాంతానికి చెందిన అంకిత్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు శివాంగి. ప్రస్తుతం 13ఏళ్ల వయసున్న శివాంగి సంచలన నిర్ణయం తీసుకుంది. సన్యాసినిగా మారేందుకు రెడీ అయింది. శివాంగి నిర్ణయాన్ని విని.. తొలుత ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. తర్వాత కూతురి నిర్ణయాన్ని స్వాగతించారు. శివాంగి సన్యాసిని దీక్ష తీసుకోవడం కోసం ఘనంగా ఏర్పట్లు చేశారు. దీంతో దాదాపు 46 మంది సాధ్వి, సాధువుల సమక్షంలో ఈ నెల 17న శివాంగి.. సన్యాసినిగా మారనుంది.  



ఈ సందర్భంగా శివాంగి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురి అభిప్రాయాన్ని విని తొలుత విస్తుపోయినట్టు చెప్పారు. ఆ తర్వాత ఆమె మనసు అర్థం చేసుకున్నట్టు వెల్లడించారు. చిన్నతనం నుంచే శివాంగి.. పలు మతాలకు సంబంధించిన రచనలను చదవడం అలవాటు చేసుకుందని చెప్పారు. ఈ క్రమంలోనే బీవార్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో నాల్గవ తరగతి వరకూ చదివి.. ఆ తర్వాత చదువులకు స్వస్తి చెప్పినట్టు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం జైన సాధ్వులతో కలిసి ఆరు నెలలపాటు 400 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిబవ్రరి 17న జైన సన్యాసినిగా దీక్ష తీసుకోబోతున్నట్టు తెలిపారు.




Updated Date - 2022-02-11T00:51:42+05:30 IST