Video Calls మాట్లాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-01T14:54:31+05:30 IST

సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో...

Video Calls మాట్లాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/మియాపూర్‌ : సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... న్యూహఫీజ్‌పేటలో ఓ బాలిక(13) 7వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తల్లిదండ్రులు కొనిచ్చిన సెల్‌ఫోన్‌ను క్లాసులకు కాకుండా గేమ్స్‌, ఫ్రెండ్స్‌తో వీడియోకాల్స్‌ ఎక్కువగా వినియోగిస్తోంది. దీంతో తండ్రి ఆమెను మందలించాడు.


మనస్తాపానికి గురైన బాలిక ఈనెల 28న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-01T14:54:31+05:30 IST