బాలుడి అదృశ్యంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-05-23T06:26:54+05:30 IST
సామర్లకోట, మే 22: మండలంలోని పెదబ్రహ్మదేవంలో వెలుగు శామ్యూల్ రాజు(13) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయినట్టు
సామర్లకోట, మే 22: మండలంలోని పెదబ్రహ్మదేవంలో వెలుగు శామ్యూల్ రాజు(13) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయినట్టు సామర్లకోట పోలీస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు అందింది. అప్ప టివరకు ఇంటి వద్దే ఆడుకుంటున్న శామ్యూల్రాజు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో బాలుడి తల్లితండ్రులు సామర్లకోట పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ టి. సునీత కేసు నమోదు చేశారు.