కరోనా మృతుడి ఖాతా నుంచి 13లక్షలు మాయం
ABN , First Publish Date - 2021-06-11T13:46:11+05:30 IST
భర్త కొవిడ్ నుంచి మరణించిన తర్వాత అతని ఖాతా నుంచి
హైదరాబాద్ : భర్త కొవిడ్ నుంచి మరణించిన తర్వాత అతని ఖాతా నుంచి రూ. 13లక్షలు మాయమయ్యాయని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూసారాంబాగ్కు చెందిన మీనాక్షి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది సైబర్ నేరం కాదని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి కరోనా సోకి కిమ్స్లో మృతి చెందగా చెక్కుల ఆధారంగానే డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. విచారణలో అతని సోదరులే ఆ డబ్బును కాజేశారని గుర్తించి దర్యాప్తు చేపట్టారు.