స్మగ్లింగ్: ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్ల సీజ్!

ABN , First Publish Date - 2020-07-25T14:42:26+05:30 IST

స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 13 మందిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కస్లమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

స్మగ్లింగ్: ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్ల సీజ్!

న్యూఢిల్లీ: స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 13 మందిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కస్లమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 7.5 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి భారత్ చేరుకున్న వారిని ఎయిర్‌పోర్టులోనే అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టైన వారందరూ దుబాయ్‌లో కార్మికులుగా పనిచేసేవారని, కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వారు ఇటీవలే భారత్‌కు తిరిగివచ్చారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ రూ. 66.6 లక్షలు అని వారు తెలిపారు.

Updated Date - 2020-07-25T14:42:26+05:30 IST