13 జిల్లాల్లో వందలోపు Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-08T17:04:19+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకా రం 6,151 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 2,718 మందికి నిర్ధారణ కాగా 13 జిల్లాల్లో కొవిడ్ కేసులు వందలోపే
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకా రం 6,151 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 2,718 మందికి నిర్ధారణ కాగా 13 జిల్లాల్లో కొవిడ్ కేసులు వందలోపే నమోదయ్యాయి. మైసూరులో 285, తుమకూరులో 210 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో 100- 200 మధ్య నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,802 మంది కోలుకోగా 49 మంది మృతి చెందారు. బెంగళూరులోనే 15 మంది ఉన్నారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 87,080 మంది చికిత్సలు పొందుతున్నారు.