1,263 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-22T18:23:12+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 1,263 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 6,278 మందికి పరీక్షలు నిర్వహించగా 948, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,132 మందికి పరీక్షలు నిర్వహించగా 315 మంది
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 1,263 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 6,278 మందికి పరీక్షలు నిర్వహించగా 948, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,132 మందికి పరీక్షలు నిర్వహించగా 315 మందికి పాజిటివ్ వచ్చింది. 320 పడకలున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శుక్రవారం ఆరుగురు చేరగా ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతుండగా 297 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.