126 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-28T16:49:31+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరింత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 126 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 114 మందికి వైరస్ సోకగా విజయపురలో నలుగురికి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరింత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 126 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 114 మందికి వైరస్ సోకగా విజయపురలో నలుగురికి చిత్రదుర్గ, మైసూరులలో ఇద్దరు చొప్పున మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు. 22 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 99 మంది డిశ్చార్జి కాగా మృతులు చోటుచేసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1713 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 1648 మంది ఉన్నారు.