Maha padayatra: 11వ రోజుకు అమరావతి రైతుల మహాపాదయాత్ర
ABN , First Publish Date - 2022-09-22T15:13:15+05:30 IST
అమరావతి రైతుల మహా పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది.
అమరావతి: అమరావతి రైతుల (Amaravati farmers) మహా పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం చిన్నాపురం నుంచి వందలాది మంది రైతులతో మహాపాదయాత్ర (Maha padayatra) ప్రారంభమైంది. చిన్నాపురం నుంచి మచిలీపట్నం మీదుగా పెడన వరకు ర్యాలీ సాగనుంది. దారి పొడవునా రైతుల యాత్రకు స్థానిక రైతులు, ప్రజలు స్వాగతం పలికుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో సంఘీభావంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సూర్య రధంలో కొలువైన వెంకటేశ్వర స్వామికి అమరావతి రైతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం రైతుల పాదయాత్ర కొనసాగుతోంది.