1,176 ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి
ABN , First Publish Date - 2021-05-15T23:23:12+05:30 IST
1,176 ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి
చెన్నై: జీఆర్హెచ్ ఆరోగ్య కేంద్రం వద్ద 1,176 ఆక్సిజన్తో కూడిన పడకలను తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ శుక్రవారం ప్రారంభించారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మదురైలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇప్పుడు మొత్తం 1,681 పడకలు ఉన్నాయని ఆయన చెప్పారు. స్టెర్లైట్ కాపర్ వద్ద ఆక్సిజన్ ఉత్పత్తి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ నుంచి ఆక్సిజన్ను ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. మరో వైపు తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విలయతాండవం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.