కశ్మీర్లో 110 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-04-11T04:17:01+05:30 IST
లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన 110 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 వాహనాలను...
శ్రీనగర్: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన 110 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కన్యర్, పరింపోరా ప్రాంతాల్లో 7 దుకాణదారులతో కలిపి 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బండిపోరా ప్రాంతంలో 50 మందిని అరెస్టు చేసి 6 వాహనాలను సీజ్ చేశారు. అలాగే హరిద్వారా ప్రాంతంలో నిబంధనలను అతిక్రమించిన మరో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనలను పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చిరించారు. అరెస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.