కామారెడ్డి జిల్లాలో 110 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-08-07T06:32:59+05:30 IST
జిల్లాలో గురువారం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం.
కామారెడ్డి టౌన్, ఆగస్టు 6: జిల్లాలో గురువారం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. ఎల్లారెడ్డి నుంచి గతంలో పంపిన 107 శాంపిల్స్లో 33 మందికి పాజిటివ్ రాగా, బాన్సువాడలో గతంలో వెలు వడిన పలువురి ఫలితాలు పెండింగ్లో ఉండగా అందులో 25 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇవీకాక జిల్లాలోని ఆయా పీహెచ్సీ పరిధిలో ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా మొత్తం 52 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. అంతేకాకుండా గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి 157 శాంపిల్లు సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపినట్లు తెలిసింది.
లింగంపేటలో నలుగురికి కరోనా పాజిటివ్
లింగంపేట: మండలంలో గురువారం నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సాయికుమార్ తెలిపారు. మండలంలోని మెంగారంలో ఇద్దరికి, లింగంపేట మండల కేంద్రంలో ఇద్దరికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
నస్రుల్లాబాద్ పది..
నస్రుల్లాబాద్: మండలంలో మంగళవారం పలువురు శాంపిల్స్ ఇవ్వగా, బుధవా రం రాత్రి పది కేసులు నిర్ధారణ అయినట్లు రిజల్ట్ వచ్చిన ట్లు వైద్యుడు రవిరాజా తెలిపారు. దుర్కిలో నాలుగు, నెమ్లిలో నాలుగు, అంకోల్ తండా లో ఒకటి, అంకోల్ గ్రామంలో ఒకటి మొత్తం పది కేసులు పాజిటివ్ నిర్ధారణ కాగా, మండలంలో మొత్తం 39 పాజిటివ్ కేసులున్నాయన్నారు.
బీర్కూర్లో రెండు..
బీర్కూర్: మండలంలో రెండు కరోనా కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. సంబాపూర్లో ఒకరికి, రైతునగర్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలి పారు.
భిక్కనూరులో ఐదుగురికి..
భిక్కనూరు: భిక్కనూరు, రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆయా గ్రామా ల్లో ఐదుగురికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు రవీందర్, శిరీష్కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ భిక్కనూరు పీహెచ్సీలో 27మందికి కరోనా పరీక్షలు నిర్వహి ంచగా మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఒకరికి, రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన ఒకరికి పాజిటీవ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. రాజంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 41 మందికి పరీక్షలు నిర్వహించగా మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ముగ్గురికి నిర్ధారణ అయ్యిందన్నారు.
తాడ్వాయిలో నలుగురికి..
తాడ్వాయి: మండలంలో గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎర్రాపహాడ్ వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రా పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలో చిట్యాల గ్రామానికి చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.
బీబీపేటలో ఒకరికి..
బీబీపేట: బీబీపేట పీహెచ్సీ పరిధిలో గురువారం ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధి కారి సంతోష్ తెలిపారు.