తల్లికి కేన్సర్.. చికిత్సకు డబ్బుల్లేక వ్యభిచారానికి సిద్ధపడిన 11 ఏళ్ల బాలిక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..

ABN , First Publish Date - 2021-10-02T22:37:22+05:30 IST

ముగ్గురు మహిళలు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. కస్టమర్‌తో రూ.40వేలకు బేరం కుదుర్చుకుని.. ఓ అమ్మాయిని అతని వద్దకు పంపించేందుకు రెడీ అయ్యారు. చివరకు అదే కస్టమర్ ట్విస్ట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 11ఏళ్ల అమ్మాయి స

తల్లికి కేన్సర్.. చికిత్సకు డబ్బుల్లేక వ్యభిచారానికి సిద్ధపడిన 11 ఏళ్ల బాలిక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..

ఇంటర్నెట్ డెస్క్: ముగ్గురు మహిళలు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. కస్టమర్‌తో రూ.40వేలకు బేరం కుదుర్చుకుని.. ఓ అమ్మాయిని అతని వద్దకు పంపించేందుకు రెడీ అయ్యారు. చివరకు అదే కస్టమర్ ట్విస్ట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 11ఏళ్ల అమ్మాయి సహా ముగ్గరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..


నాగ్‌పూర్‌కు సమీపంలో ఉండే ఓ ప్రాంతానికి చెందిన అర్చన (35), రంజమా (45), కవిత అనే మహిళలు ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కస్టమర్ వారిని సంప్రదించాడు. అమ్మాయిని ఏర్పాటు చేస్తాం అని చెప్పి.. ఈ ముగ్గురు మహిళలు అతని వద్ద రూ.40వేలు తీసుకున్నారు. కుదుర్చుకున్న బేరం ప్రకారం అతడి కోసం వాళ్లు ఓ అమ్మాయిని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ కస్టమర్ ట్విస్ట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి.. మొత్తం విషయాన్ని అధికారులకు చేరవేశాడు. దీంతో అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ముగ్గరు మహిళలతో సహా మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. 11ఏళ్ల అమ్మాయి ఈ పనికి ఎందుకోసం ఒప్పుకుందని పోలీసులు ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. 



మైనర్ బాలిక తల్లి గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతోందని.. చికిత్స కోసం భారీ మొత్తంలో డబ్బులు కావాల్సి ఉండటంతో దీన్ని అర్చన అనే మహిళ అవకాశంగా తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల బాబును చూసుకోవడం కోసం తన కూతురును పంపిస్తే.. రూ. 5వేల ఇప్పిస్తానంటూ బాధితురాలి తల్లి వద్ద నమ్మబలికి ఆ మైనర్ బాలికను అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడైంది. నమ్మి వెంట వచ్చిన ఆ చిన్నారిని.. పాడు పని చేయాలంటూ బలవంతం చేసినట్లు తెలింది. కాగా.. తల్లి చికిత్సకు డబ్బులు అవసరం ఉండటంతో ఆ అమ్మాయి కూడా ఆ పాడు పనికి సిద్ధపడినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. ఈ క్రమంలో అర్చన, రంజమా, కవితలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. కాగా.. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది.


Updated Date - 2021-10-02T22:37:22+05:30 IST