11కేవీ తీగలు తెగి లేచిన మంటలు
ABN , First Publish Date - 2021-06-18T05:25:09+05:30 IST
11కేవీ తీగలు తెగి లేచిన మంటలు
పరిగి: పరిగి మునిసిపల్ పరిధిలోని బా లాజీనగర్, విద్యానగర్ కాలనీల మధ్యలో 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెను ముప్పు తప్పింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కాలనీల మధ్యలో ఉన్న 11కేవీ లైను విషయ మై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. తక్షణమే 11కేవీ లైన్ను తొలగించాల ని డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంత్ ఈ సందర్భంగా అధికారులను కోరారు.