ఏపీలో కరోనాతో 11 మంది మృతి

ABN , First Publish Date - 2022-02-03T00:31:07+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కరోనాతో 11 మంది మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 5,983 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 22,88.566 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మొత్తం 14,631 మంది మృతి చెందారు. ఏపీలో 1,00,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,73,313 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2022-02-03T00:31:07+05:30 IST