దుబాయి డ్యూటీ ఫ్రీ రాఫెల్: 11 మంది భారత మిత్ర బృందానికి జాక్పాట్ !
ABN , First Publish Date - 2020-08-13T17:09:02+05:30 IST
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో 11 మంది భారత మిత్ర బృందం జాక్పాట్ కొట్టింది.
దుబాయి: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో 11 మంది భారత మిత్ర బృందం జాక్పాట్ కొట్టింది. ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(రూ.75,402,511) గెలుచుకున్నారు. దుబాయిలో ఉండే రాహుల్ సంగోల్(41) తన 10 మంది స్నేహితులతో కలిసి జూలైలో కొనుగోలు చేసిన 0226 నెంబర్ గల లాటరీ టికెట్కు ఈ జాక్పాట్ తగిలింది. గత రెండేళ్లుగా ఈ మిత్ర బృందం ఈ రాఫెల్లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఐదేళ్లుగా దుబాయిలోని జబేల్ అలీ ఫ్రీజోన్లో పని చేస్తున్న సంగోల్ ఈ భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కచ్చితంగా ఈ డబ్బు ఈ కష్ట సమయంలో మాకు ఎంతో సహాయపడుతుందన్నాడు. రుణాలు తీర్చడానికి, తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు మేము ఈ నగదును వినియోగిస్తామని చెప్పాడు. ఇక 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న 166వ భారతీయుడు నాగ్పూర్కు చెందిన సంగోల్. అంతేగాక ఈ రాఫెల్ టికెట్ కొనుగోలుదారులలో భారతీయ పౌరులు అత్యధికంగా ఉన్నారని నిర్వహకులు తెలియజేశారు.