11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నాం: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2020-03-30T01:49:52+05:30 IST

తెలంగాణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని..

11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని.. వారిని సోమవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా వారిలో కూడా చాలా మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. ఒకేఒక్క వ్యక్తి.. 76 సంవత్సరాల వ్యక్తి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సీఎం చెప్పారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలిపారు. తెలంగాణలో 69 మంది కరోనా బారిన పడ్డారని.. వారిలో 11 మందికి నయం కావడంతో వారిని సోమవారం డిశ్చార్జ్ చేస్తామని.. ఇంకా 58 మందికి చికిత్స కొనసాగుతోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T01:49:52+05:30 IST