‘పది’ పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించండి: సత్యవతి

ABN , First Publish Date - 2020-05-31T08:18:16+05:30 IST

వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు.

‘పది’ పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించండి: సత్యవతి

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.  

Updated Date - 2020-05-31T08:18:16+05:30 IST