పొట్టంతా ఉబ్బి 16 ఏళ్ల కూతురికి నరకం.. గ్యాస్ వల్లేనని డౌట్‌తోనే ఆస్పత్రికి.. టెస్టులు చేసి డాక్టర్లు చెప్పింది విన్న ఆ తల్లిదండ్రులకు..

ABN , First Publish Date - 2022-09-26T22:29:04+05:30 IST

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. పదో తరగతి చదువుతోంది.. కొద్ది రోజుల క్రితం ఆమెకు కడుపు నొప్పి మొదలైంది..

పొట్టంతా ఉబ్బి 16 ఏళ్ల కూతురికి నరకం.. గ్యాస్ వల్లేనని డౌట్‌తోనే ఆస్పత్రికి.. టెస్టులు చేసి డాక్టర్లు చెప్పింది విన్న ఆ తల్లిదండ్రులకు..

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. పదో తరగతి చదువుతోంది.. కొద్ది రోజుల క్రితం ఆమెకు కడుపు నొప్పి మొదలైంది.. పొట్టంతా ఉబ్బినట్టు అయింది.. ఆ బాలిక గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతోందని తల్లిదండ్రులు భావించారు.. కూతురు కడుపునొప్పితో అల్లాడుతుండడంతో ఆరు రోజుల క్రితం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. స్కానింగ్ తీసిన వైద్యులు ఆ బాలిక తల్లిదండ్రులకు షాకింగ్ విషయం చెప్పారు.. ఆ బాలిక గర్భవతి అని, డెలివరీ డేట్ దగ్గర పడిందని చెప్పారు.. ఆ బాలిక ఆరు రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. కామాంధుడి కోరలకు చిక్కిన ఆ బాలిక ఓ బిడ్డకు తల్లి అయింది. 

 

ఇది కూడా చదవండి..

Mobile Charging: బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పెడుతుంటారా..? ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం గురించి తెలిస్తే..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని జబల్‌పూర్‌ సిహోరా సివిల్ ఆసుపత్రికి ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటలకు ఓ మహిళ తన కూతురిని తీసుకుని వచ్చింది. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని, ఆమె కడుపులో గ్యాస్ ఏర్పడిందని చెప్పింది. దీంతో వైద్యులు ఆ బాలికను జనరల్ వార్డుకు తరలించి టెస్ట్ చేశారు. పరీక్ష అనంతరం ఆ బాలిక పురిటి నొప్పులతో బాధపడుతోందని తేల్చారు. ఆ మాట విని ఆ బాలిక తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. మరో అరగంటలో ఆ బాలిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర షాక్‌కు లోనైన బాలిక ఆరు రోజుల తర్వాత కూడా తన బిడ్డ మొహం చూడడానికి ఇష్టపడడం లేదు. అలా ఏడుస్తూనే ఉంది.  చివరకు పోలీసులకు ఏం జరిగిందో చెప్పింది. 


దాదాపు పది నెలల క్రితం పొరుగింట్లో ఉండే ఓ 24 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. స్కూల్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ యువకుడు బలవంతంగా తనను పొలం వైపు ఈడ్చుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించాడని, అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పలేదని తెలిపింది. బాలిక వాంగ్మూలం తర్వాత నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు అతడిని అరెస్ట్ చేశారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-09-26T22:29:04+05:30 IST