ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-06T03:19:28+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌‌లో రోజురోజుకూ ఏ రేంజ్‌‌లో విజృంభిస్తోందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు నమోదు

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌‌లో రోజురోజుకూ ఏ రేంజ్‌‌లో విజృంభిస్తోందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. తాజాగా.. ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 4,347 చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,00,880 యాక్టివ్ కేసులుండగా.. 3,82,104 మంది కోలుకున్నారు. కాగా.. ఏపీలో ఇప్పటివరకు 40.35 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.


జిల్లాల వారిగా మరణాలు..


ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు.. 




Updated Date - 2020-09-06T03:19:28+05:30 IST