కాసుల వర్షం.. ఒక్కరోజులోనే రూ.108కోట్లు..
ABN , First Publish Date - 2022-05-02T19:21:05+05:30 IST
కాసుల వర్షం.. ఒక్కరోజులోనే రూ.108కోట్లు..
హైదరాబాద్ సిటీ : ఎర్లీ బర్డ్ ఆఫర్లో జీహెచ్ఎంసీ కాసుల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో రూ.742.41 కోట్ల పన్ను వసూలైంది. శనివారం ఒక్కరోజు రూ.108 కోట్లు వసూలైనట్టు ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి. 7.26 లక్షల మంది పన్ను చెల్లించారు. కిందటి ఆర్థిక సంవత్సరం రూ.1495 కోట్ల పన్ను వసూలు కాగా, ప్రస్తుత సంవత్సరం మొదటి నెలలోనే రూ.742 కోట్లు వసూలు కావడం గమనార్హం. కేవలం ఒక్క నెలలోనే దాదాపు 50 శాతం పన్ను వసూలు కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సంస్థకు ఇంది ఎంతో ఉపశమనమని ఓ అధికారి పేర్కొన్నారు.