108 అంబులెన్స్ ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-07-03T06:05:59+05:30 IST
భైంసాలో శనివారం 108 అంబులెన్స్ ఢీకొని ఒకరు మృతి చెందారు.
భైంసా క్రైం, జూలై 2 : భైంసాలో శనివారం 108 అంబులెన్స్ ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానిక శివారుకాలనీలో నివాసముంటున్న కుభీర్ మండలంలోని సోనారి గ్రామానికి చెందిన కాలేకర్ దిగంబర్(54) మధ్యా హ్నం మార్కెట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుంటాల మండలం కల్లూర్ ప్రాంతం నుంచి విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని భైంసా ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమి త్తం తీసుకువస్తున్న 108 అంబులెన్స్ స్థానిక గీతపెట్రోల్ సమీపంలోని డివైడర్ వద్ద రోడ్డు దాటు తున్న కాలేకర్ దిగంబర్ను ఢీ కొట్టడంతో ఘటన జరిగింది. ఇందులో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని అదే అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమచికిత్స నిర్వహిస్తుండ గానే కాలేకర్ దిగం బర్ మృతి చెందాడు. భైంసాటౌన్ ఎస్సై హన్మండ్లు ఏరియా ఆసుపత్రిలో 108 అంబులెన్స్ పైలట్, ఈఎంటీల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతునికి భార్యతో పాటు కూతురు ఉన్నట్లు సమాచారం.