అమెరికాలో మృత్యుఘోష.. కరోనాతో ఒక్కరోజులో 1169 మంది మృతి

ABN , First Publish Date - 2020-04-03T20:38:32+05:30 IST

అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది కరోనా బాధితులు...

అమెరికాలో మృత్యుఘోష.. కరోనాతో ఒక్కరోజులో 1169 మంది మృతి

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది కరోనా బాధితులు ఇక్కడ తుది శ్వాశ విడిచారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా గురువారం వెల్లడైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం రాత్రి 8:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 


దీంతో ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో ఇప్పటివరకు ఇటలీ(969) ముందుండగా.. ప్రస్తుతం ఆ స్థానంలోకి అమెరికా(1169) చేరింది. 


ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలో మొత్తం 2,45,380 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదుకాగా.. వాటిలో 503 కేసులు కొత్తగా నమోదైనవి.

Updated Date - 2020-04-03T20:38:32+05:30 IST