104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:05:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన  కల్పించాలి
ముఖ్యమంత్రి వీసీలో పాల్గొన్న జేసీలు గౌతమి, సాయికాంత్‌ వర్మ, ఎస్పీ అన్భురాజన్‌

వీసీలో కలెక్టర్లకు, ఎస్పీలు, జేసీలకు ముఖ్యమంత్రి ఆదేశం


కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో కొవిడ్‌ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి,  సీఎం సాయికాంత్‌ వర్మ,  ఎస్పీ  కేకే అన్బురాజన్‌, జిల్లా అధికారులు, కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం  జాయింట్‌ కలెక్టర్లు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లో శానిటేషన్‌, భోజన వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో సిబ్బంది, వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ, కొవిడ్‌ నోడల్‌ అధికారులను జాయింట్‌ కలెక్టర్లు ఆదేశించారు. కొవిడ్‌కు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నా 104కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. 104 కాల్‌ సెంటరు సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే విధంగా అధికారులు  విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కొవిడ్‌ పరీక్ష మొదలు వైద్యం, ఆసుపత్రులలో మెడిసిన్‌, శానిటేషన్‌, క్వాలిటీ ఆఫ్‌ పుడ్‌ వరకు  ఏమాత్రం రాజీ లేకుండా అందించే విధంగా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఅడ్‌హెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్లర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:05:42+05:30 IST