స్వయంగా 104కి ఫోన్ చేసిన విజయసాయి
ABN , First Publish Date - 2021-04-30T21:23:58+05:30 IST
కలెక్టరేట్లోని 104 కంట్రోల్ రూమ్కు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్కూడా రాకపోవడంతో..
విశాఖ: కలెక్టరేట్లోని 104 కంట్రోల్ రూమ్కు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్కూడా రాకపోవడంతో.. స్వయంగా 104కి ఫోన్ చేశారు. కాల్ కనెక్ట్ కాకపోవడంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వర్లో సాంకేతికలోపం ఉందని అధికారులు చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను విజయసాయిరెడ్డి ఆదేశించారు. అనంతరం కేజీహెచ్లో వైరాలజీ లాబ్ను విజయసాయి సందర్శించారు. టెస్టింగ్, నిర్వహణ తీరును వైద్యుల నుంచి అడిగి ఆయన తెలుసున్నారు.