అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.102.93 కోట్లు

ABN , First Publish Date - 2021-02-28T14:11:34+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.102.93 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అసెంబ్లీలో శనివారం ప్రకటించారు...

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.102.93 కోట్లు

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.102.93 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నోటికేషన్‌ శుక్రవారం విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌, ఎన్నికల నిర్వహణకు అధిక నిధులు వ్యయం చేయాల్సిన పరిస్థితులున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల వ్యయానికి రాష్ట్రప్రభుత్వం రూ.102.93 కోట్టు కేటాయించిందని ఆయన  తెలిపారు. అదే సమయంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ ఆమోదించినట్టు పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రస్తుతం కొనసాగు తున్న ప్రభుత్వ పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-02-28T14:11:34+05:30 IST