ఏపీలో 10,171 కరోనా కేసులు.. 89 మరణాలు

ABN , First Publish Date - 2020-08-08T01:33:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా

ఏపీలో 10,171 కరోనా కేసులు.. 89 మరణాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 10,171 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా ఇవాళ ఒక్కరోజే 89 మరణాలు సంభవించడం రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,842 మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి.


ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 6వేల 960కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 62,938 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కర్నూలు జిల్లాలో ఇవాళ 1331 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1270, అనంతపురం జిల్లాలో 1100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 23,62,270 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.



Updated Date - 2020-08-08T01:33:22+05:30 IST