Asaduddin ఆరోగ్యం కోసం 101 మేకల సద్ఖా..
ABN , First Publish Date - 2022-02-07T14:33:18+05:30 IST
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై..
హైదరాబాద్ సిటీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగి న దాడి నేపథ్యంలో పాతనగరంలో ప్రార్థలు కొనసాగుతున్నాయి. ఆదివారం యాకత్పురాకు చెందిన వ్యాపారి మహమ్మద్ షకీల్.. అసదుద్దీన్ ఒవైసీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 101 మేకలను బలి(సద్ఖా)ఇచ్చారు. యూపీలో జరిగిన దాడిలో ఒవైసీ త్రుటిలో తప్పించుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు షకీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మలక్పేట్ ఎమ్మెల్యే బలాలా హాజరయ్యారు.