జాతీయ పతాకాలతో 100 కిలోమీటర్ల సైక్లింగ్ రన్
ABN , First Publish Date - 2021-01-27T05:24:31+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్’ సభ్యులు సైక్లింగ్ రన్ నిర్వహించారు. గ్రూప్ సభ్యులు 120 మంది 100 కిలోమీటర్ల సైక్లింగ్ రన్లో పాల్గొన్నారు. ప్రతి సైకిల్కు మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకున్నారు.
తూప్రాన్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్’ సభ్యులు సైక్లింగ్ రన్ నిర్వహించారు. గ్రూప్ సభ్యులు 120 మంది 100 కిలోమీటర్ల సైక్లింగ్ రన్లో పాల్గొన్నారు. ప్రతి సైకిల్కు మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా సుచిత్ర నుంచి తూప్రాన్ వరకు విచ్చేసి తిరిగి సుచిత్ర వరకు వెళ్లారు.